JANGITISRINIVASMUDIRAJ96

Mar 28 2024, 15:16

ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు ఉన్నట్ల లేనట్ల! పొద్దుతిరుగుడు ధ్యానం ప్రభుత్వం ఎందుకు కొనడంలేదు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు ఉన్నట్ల లేనట్ల!

పొద్దుతిరుగుడు ధ్యానం ప్రభుత్వం ఎందుకు కొనడంలేదు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 28-03-2024 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం పొద్దుతిరుగుడు ధ్యానం కొనుగోలు చేయడానికి మార్క్ పేడ్ సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఒక్క వారం కూడ తూకం వేయకుండానే కొనుగోలు నిలిపివేయడంతో ధాన్యం తెచ్చిన రైతులు రోజుల తరబడి అధికారులు కనికరం చూపడం లేదని బీఆర్ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

గురువారం నాడు ధాన్యం నిల్వలను సంబంధిత రైతులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా జంగిటి మాట్లాడుతూ పథకాల పేరుతో ప్రచారానికి పరిమితమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు పండించిన సన్ ప్లవర్ ధాన్యం కొనుగోలు మరిచారని అన్నారు గత ఇరువై రోజులుగా రైతులు ధాన్యం కుప్పలవద్ద పడిగాపులు కాస్తుంనరని కనీసం మంచ్చి నీల్లు ఇచ్చే నాధుడు కరువైయారని అన్నారు రెపట్టివరకు కొనుగోలు ప్రారంభించకుంటే రైతులతో కలసి రామునిపట్ల వద్ద రాజీవ్ రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు వారితో రైతులు రాజిరెడ్డి, రాములు, రంగారెడ్డి, ప్రతాపరెడ్డి, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Mar 27 2024, 07:08

ఖాజీపూర్ కు న్యాయం జరగకపోతే ముదిరాజ్ లము ఎన్నికలకు దూరం... రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ఖాజీపూర్ కు న్యాయం జరగకపోతే ముదిరాజ్ లము ఎన్నికలకు దూరం...

రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ 

అక్బర్ పేట/ భూంపల్లీ

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట మండలం భూంపల్లి గ్రామ ముదిరాజులకు న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు దూరంగా ఉంటామని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దుబ్బాక నియోజకవర్గం ముదిరాజ్ ముఖ్య నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఖాజీపూర్ గ్రామంలో ముదిరాజ్ కులస్తులను గ్రామ బహిష్కరణ చేయడంపై మండిపడ్డారు. ఘాజీపూర్ గ్రామంలో సొంత రాజ్యాంగం ఉన్నట్లుగా అక్కడి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పించిన చట్టబద్ధతను కూడా గ్రామస్తులు తుంగలో తొక్కి ముదిరాజ్ మధ్య సంపదపై మీకు హక్కు ఉండదని ఉకుం జారీ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. ముదిరాజులను సామాజిక వెలివేతకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ గారికి వచ్చే నెల ఒకటో తారీకు వరకు ముదిరాజులకు న్యాయం జరిగిందని అధికారిక ప్రకటన రాకుంటే ముదిరాజులం ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరి ఇందులో పాల్గొంటున్న రాజకీయ నాయకులపై ఆయా పార్టీలు క్రమశిక్షణ చర్యలు తీసుకోకుంటే ఆ పార్టీలను కూడా ముదురాజుల వద్దకు రానివ్వమన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ జేఏసీ సిద్దిపేట జిల్లా నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ పడిగా ప్రశాంత్ ముదిరాజ్, దుబ్బాక నియోజకవర్గం కన్వీనర్ చికెన్ సత్తి, దుబ్బాక ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తోట్ల మల్లేశం, ముదిరాజ్ నాయకులు రమేష్, భూపతి, గణేష్, నరసింహులు,

JANGITISRINIVASMUDIRAJ96

Mar 22 2024, 22:45

కాజిపూర్ ముదిరాజులబైస్కరణ అప్రజాస్వామికం! ముదిరాజులను వెలేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

కాజిపూర్ ముదిరాజులబైస్కరణ అప్రజాస్వామికం!

ముదిరాజులను వెలేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

తేది: 22-03-2024 శుక్రవారం

కలెక్టరేట్ న్యూస్

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం భూంపల్లి మండల్ ఖాజీపూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కుటుంబాలను కొందరు భయభ్రాంతులకు గురిచేసి వెలివేశారు వెలువేద గురైన 30 ముదిరాజ్ కుటుంబాలు శుక్రవారం రోజు సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారిని మరియు పోలీస్ కమిషనర్ గారిని కలిసి వారికి జరిగిన అన్యాయంపై రాతపూర్వకంగా మేమోరాండం ఇచ్చారు విషయం తెలుసుకున్న ముదిరాజ్ ప్రతినిధులు ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ సుతారి రాజు నియోజకవర్గ కన్వీనర్ పడిగే ప్రశాంత్ టౌన్ అధ్యక్షులు మిద్దె రవి ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ యూత్ కన్వీనర్ చెంది శ్రీనివాస్ నాయకులు కిష్ణపురం లక్ష్మణ్ యాట రాజేష్ పడిగే లింగం రాగులు రాజు చింతమడక రాజన్నలు వెలివేతకు గురైన ముదిరాజ్ కుటుంబాలకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో మనుషులు మనుషులని వెలివేయడం ఏమిటని ఇది ఏమైనా రాచరిక పాలన అని ముదిరాజులు అంటేనే చులకనగా చూస్తూ చెరువులో చేపలు పట్టవద్దని సొసైటీలు చేసుకోవద్దని ఆంక్షలు విధించి గ్రామ బహిష్కరణ చేయడము ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు జీవో నెంబర్ 98/1964 ప్రకారం ముదిరాజులు మత్స్యకారులని మత్స్య సంపదపై చెరువులపై ముదిరాజ్లకు సర్వహక్కులు ఉన్నాయని ప్రభుత్వం ఇచ్చిన జీవోని సైతం కాదంటూ గ్రామస్తులు కొంతమంది కవ్వింపు చర్యలు దిగుతూ ముదిరాజుల పైన గ్రామ బహిష్కరణ వేటు వేయడం సరైనది కాదన్నారు ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి వెలివేసినటువంటి వ్యక్తులపైన చర్య తీసుకొని ముదిరాజులకు న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వెలివేతకు గురైన ముదిరాజ్ కుటుంబాలు ఉన్నారు

JANGITISRINIVASMUDIRAJ96

Feb 11 2024, 18:24

ముగిసిన జిల్లా స్థాయి స్మారక క్రికెట్ టోవర్నమెంట్!

ముగిసిన జిల్లా స్థాయి స్మారక క్రికెట్ టోవర్నమెంట్!

తేది: 11-02-24 ఆదివారం

చిన్నకోడూర్ న్యూస్

చిన్నకోడూర్ మండల కేంద్రంలో డ్రీమ్ లెవన్ టీమ్ సభ్యులు నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి శేఖర్, విఘ్నేష్ ల స్మారక టోర్నమెంట్ ఈరోజు ముగిసింది గత 20 రోజులుగా 36 టీమ్ లు తలపడగా ఫైనల్ కు చేరిన మైలారం కమ్మర్లపల్లి, చిన్నకోడూర్ టీమ్ లు తలపడగా విన్నర్ గా మైలారం-కమ్మర్లపల్లి నిల్వగా చిన్నకోడూర్ రన్నర్ గా నిలిచింది ఇట్టి కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఉమేష్ చంద్ర, బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, సీనియర్ క్రీడాకారులు హనుమయ్య, వార్డ్ మెంబర్ ఇట్టబోయిన శేఖర్, నాయకులు నిమ్మల వెంకటేశం, సామల అవినాష్, బీరయ్య లు ముఖ్య అతిథులుగా వచ్చి విన్నర్ గ నిలిచిన జట్టుకు 40 వేల రూపాయలు నగదు పారితోషికంతో పాటుగా బహుమతిని అందించారు రన్నర్ గా నిలిచిన జట్టుకు 20 వేల రూపాయలు నగదు పారితోషికంతో పాటుగా బహుమతిని అందించారు ముందుండి ఈ టోవర్నమెంట్ నిర్వహించిన ఏయ్య ప్రసాద్, గుడిసె పవన్ లను అభినందించారు.

JANGITISRINIVASMUDIRAJ96

Feb 01 2024, 18:10

కేంద్ర బడ్జెట్ పేదలకు అందని ద్రాక్షే! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

కేంద్ర బడ్జెట్ పేదలకు అందని ద్రాక్షే!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 01-02-2024 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

మోడీ సర్కార్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ పేదలకు ఆశచూపినట్లు ఉందని అది పేదలకు అందేవిదంగా లేదని బి.ఆర్.ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మోడీ పది సంవత్సరాల క్రితం కుబేరుల వద్ద మూలుగుతున్న నల్లధనాన్ని బైటకు తీసి పేదలకు ఒక్కో అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తానని వాగ్దానం చేసి గద్దెనెక్కినాక నల్లధనం తియ్యకపోగా పేదలకు అందే సబ్సిడీలను తీసేసి కార్పొరేట్ సంస్థల కొమ్ముకాస్తున్నాడని అన్నారు.

గత ఎన్నికల్లో యువత మదిలో హిందు వాదం నింప్పి మతాల మధ్య చిచ్చుపెట్టి గద్దెనెక్యారని అన్నారు.

మూడోసారి గద్దెనెక్కడానికి మధ్యంతర బడ్జెట్ అంట్టు కొత్త నాటకానికి తీశారని అన్నారు.

గత పది సంవత్సరాలల్లో 250 మిలియండ్ల పెదాలను అభివృద్ధిలోకి తెచ్చినట్లు ప్రకటించడం హాహ్యస్పదమని అన్నారు.

ఇది కేవలం ఎన్నికల కోసం ప్రకటన తప్పితే ఏమి లేదన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Jan 26 2024, 09:45

ఇచ్చిన్న మాటకు కట్టుబడి ముదిరాజుల డిమాండ్ నెరవేర్చాలి! ముదిరాజులను విస్మరించిన ప్రభుతలు కూలిపోవుడే! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ఇచ్చిన్న మాటకు కట్టుబడి ముదిరాజుల డిమాండ్ నెరవేర్చాలి!

ముదిరాజులను విస్మరించిన ప్రభుతలు కూలిపోవుడే!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 25-01-2024 గురువారం

చిన్నకోడూర్ న్యూస్

ముదిరాజులను విమర్శించి పట్టించుకోకుండా చిన్నచూపు చూసిన ప్రభుత్వం ఏది నిలబడదని అది కూలిపోతుందని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు తుపాకుల బాల్ రంగం ముదిరాజ్ అన్నారు.

గురువారం చిన్నకోడూర్ పెద్దమ్మ ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు మేడికాయల వెంకటేశం అధ్యక్షతన జరిగి ముదిరాజ్ మండల సమావేశంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ ముదిరాజులు బి.సి "ఏ" కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని రాజకీయ పార్టీలు ముదిరాజుల డిమాండ్ నెరవేరుస్తామని నమ్మపలికి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ముదిరాజులను పట్టించుకోకుంట్టే ఓట్ల ద్వార బుద్ది చెప్పి ఆ ప్రభుత్వం నిల్వకుండా కాలగర్భంలో కలిపామని ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలో ముదిరాజుల డిమాండ్ నెరవేరుస్తామని అనేక సమావేశంలో ప్రస్తావిస్తూ కాంగ్రేస్ పార్టీ ఎన్నికల మెనిపెస్టోలో ముదిరాజుల అంశాన్ని పొందుపర్చారని ఆ విషయం నాన్చాకుండా త్వరగా ముదిరాజుల సమశ్య పరిగణనలోకి తీసుకొని ముదిరాజులను బి.సి "ఏ" చేర్చి న్యాయం చేయలని లేకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ముదిరాజుల ఆగ్రహానికి గురి కావల్శివస్తుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్యాల కిషన్ ముదిరాజ్, మాజీ అధ్యక్షుడు దూలం ముత్యం, స్థానిక అధ్యక్షులు చింతకింది ప్రభాకర్, కొత్త శంకర్, దొంతురబోయిన శ్రీనివాస్, మాటిండ్ల కిషన్, నిమ్మల వెంకటేశం, యాట చెందు, బాబు, బాలేష్, తిరుపతి, మహేష్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Dec 22 2023, 13:53

పల్లవి ప్రశాంతుని బేషరత్ గా విడుదల చేయాలి! తెలంగాణ రైతు బిడ్డ విజేతగా నిలిస్తే ఇంత కక్షసాదింపా? జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ సంఘం రాష్ట

పల్లవి ప్రశాంతుని బేషరత్ గా విడుదల చేయాలి!

తెలంగాణ రైతు బిడ్డ విజేతగా నిలిస్తే ఇంత కక్షసాదింపా?

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

తేది: 22-12-2023 శుక్రవారం

సిద్దిపేట టౌన్ న్యూస్

బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అక్రమ అరెస్టును కండిస్తున్నామని అతన్ని బేషరత్ గ విడుదల చేయాలనీ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

పల్లవి ప్రశాంత్ అరెస్టును నిరసిస్తూ అతని బేషరత్ గ విడుదల చేయాలనీ సిద్దిపేటలో బి.ఆర్. అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు సీజన్లో కానీ అల్లర్లు తెలంగాణ రైతు బిడ్డడు పల్లవి ప్రశాంత్ విన్నర్ గ నిలిచినప్పుడే జరుగాల ఇదంతా చూస్తుంటే కక్షపురితమే నని అనిపిస్తుందని పల్లవి ప్రశాంత్ నిరుపేద ముదిరాజ్ కుటుంబంలో పుట్టడమే పాపమా బలహీన వర్గాలలో తెలివి పరులు ముందుకు రకూడదా అని అన్నారు.

ప్రశాంత్ పైన పెట్టిన కేసులు ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయలని లేని పక్షంలో ముదిరాజులంతా ఏకమై రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పడిగె ప్రశాంత్, సుతారి రాజు, పుల్లూర్ సుధాకర్, కండ్లకోయ బాలకృష్ణ, కోరబోయిన సుధాకర్, బోనాల శ్రీనివాస్, తుమ్మల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Dec 19 2023, 14:28

ఘనంగా కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ వర్దంతి జరుపుకున్న ముదిరాజులు

పాత్రికేయుడు హైదరాబాద్ నగర రూపకర్త కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్!

కృష్ణ స్వామి ముదిరాజ్ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముదిరాజులు

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

తేది: 19-12-2023 మంగళవారం

చిన్నకోడూర్ న్యూస్

పాత్రికేయ సంపాదకుడు హైదరాబాద్ మాజీ మేయర్ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారు ప్రజా సేవ చేస్తూనే ముదిరాజ్ హక్కుల సాధన కోసం పోరాటం చేసిన మహోన్నతుడు అని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.

కృష్ణ స్వామి ముదిరాజ్ 56వ వర్దంతి సందర్భంగా చిన్నకోడూర్ మండల కేంద్రంలో అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ గారు 1922లో నిజాం రాజ్య కాలంలో ముదిరాజ్ మహాసభను స్థాపించారు తరువాత 40 సంవత్సరాల పాటుగా మహాసభకు అధ్యక్షుడిగా ఉన్నారు మరియు ముదిరాజ్ సంఘం మరియు నగరంలోని ఇతర బలహీన వర్గాలకు విద్యారంగంలో చాలా శ్రమించారు. అతను అనేక గ్రంథాలయాలను కూడా స్థాపించడమే కాకుండా స్త్రీ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి హిందీ కన్యా పాఠశాలను ఏర్పాటు చేశాడు.

ఆయన మేయర్‌గా ఉన్న సమయంలోనే హైదరాబాద్‌కు మాస్టర్‌ప్లాన్‌ను ఖరారు చేశారు. హైదరాబాద్ మేయర్‌గా అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను ఆహ్వానించారు మరియు యుగోస్లేవియా అధ్యక్షుడు మార్షల్ టిటోకు పౌర రిసెప్షన్‌ను నిర్వహించారు.

అంతకు ముందు డక్కన్ స్టార్', ఆంగ్ల వారపత్రిక మరియు 'మసావత్', ఉర్దూ వారపత్రికలకు సంపాదకులుగా పనిచేశారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు చింతకింది ప్రభాకర్, పిట్ల నాగార్జున, కోరమేన సుధాకర్, దొంతురమేన శ్రీనివాస్, అంబటి కనకయ్య, జంగిటి ప్రభాకర్, గుడిపల్లి వికాస్, గౌరమేన స్వామి, దయ్యాల నాగరాజు తదితరులు వున్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Dec 11 2023, 23:05

ముదిరాజులను బి.సి ఏ లోకి మార్చాలి

మార్చాలిముదిరాజులను బి.సి "ఏ" కి త్వరగా చేర్చాలి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

తేది: 11-12-2023 సోమవారం

సిద్దిపేట కలెక్టరేట్ న్యూస్

గడిచిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజులను బి.సి ఏ లోకి త్వరగా మార్చాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.

సోమవారం రోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసిన ముదిరాజులు బీ.సీ ఏ డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి అందించి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజులకు సరైన రిజర్వేషన్ లేక ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు రాక ఆర్థికంగా ఎదగలేకపోతున్నారని అందుకనే ముదిరాజ్ లను బీసీ ఏ లోకి మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆ యొక్క వినతి పత్రాన్ని సిద్ధిపేట కలెక్టర్ గారికి అందించామని మన ఎన్నికల అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముదిరాజులను బీసీలు చేస్తానని మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచారని దాని ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ రాకముందే ముదిరాజులను బిసి ఏలోకి చేర్చాలని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ జేఏసీ చైర్మన్ పడిగే ప్రశాంత్ జిల్లా సోషల్ మీడియా చైర్మన్ సుతారి రాజు చిన్నకోడూరు మండల సంఘం అధ్యక్షులు మెడికాయల వెంకటేశం పుల్లూరు సుధాకర్ గాడిచెర్ల సతీష్.బోనాల నర్సిలు.బోనాల నాగరాజు.కండ్లకోయ బాలకిషన్. బోనాల నాగరాజు.దివిటి రాయిన సత్యం.పాతర్ల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Dec 01 2023, 19:38

పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ ప్రణత్యాగమే నేటి ఆకుపచ్చ తెలంగాణ! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ ప్రణత్యాగమే నేటి ఆకుపచ్చ తెలంగాణ!

తేది: 01-12-2023 శుక్రవారం

చిన్నకోడూర్ న్యూస్

స్వరాష్ట్రం ఏర్పడి ఆకుపచ్చ పసిడి తెలంగాణగా దూసుకు పోతుందంటే అది పోలీస్ కిష్టన్న ప్రాణ త్యాగ ఫలితమే నని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.

పోలీస్ కిష్టన్న14వ వర్దంతి సందర్భంగా చిన్నకోడూర్ ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు మేడికాయల వెంకటేశం ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ముదిరాజ్ సభ్యులు కిష్టన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఈ సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ సమాఖ్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల నీడన తెలంగాణ నెర్రెలు వారి తలపున గోదావరి గలగలా పారిన తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరుకని సమయాన స్వరాష్ట్రం కోరుతు మాలి దశ ఉద్యమం చేస్తున్నపుడు రాష్ట్రం సిద్దించేవరకు పోరాటం అగకూడాని నినదిస్తూ తన సర్వీస్ రివల్ వార్ తో కాల్చుకొని ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు పోలీస్ కిష్టన్న ముదిరాజ్ అయన ప్రాణత్యాగంతో ఉద్యమాన్ని సకలజనుల సమ్మేగా మారిందని అసమ్మే ద్వార కేంద్ర ప్రభుత్వాన్ని ఊపిరాడకుండా చేసిందని తట్టుకోలేక కేంద్రం తెలంగాణ ప్రకటించిందని అన్నారు.

తెచ్చుకున్న తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకో తాగు సాగు నీరు తెచ్చుకున్నామని ప్రాజెక్టుల ద్వార నెర్రెలు వారిని బీడు భూములు నేడు సశ్యశమలమై పచ్చని పసిడి తెలంగాణగా మారిందని దీనికి కారణం మీ ప్రణత్యాగమని కిష్టన్న మిమ్ములను జాతి మరువదని అన్నారు.

ఈ కార్యక్రమంలో కోరబోయిన సుధాకర్, కొత్త బాల్ రాజు, ఇట్టబోయిన బాలపోషయ్య, బోయిని ఆనందం, పసుపుల సాయిలు, ముత్తయ్య, బుచ్చెలిరమేష్, దుర్గం ఎల్లం, ఉప్పరమేన శంకర్, రామంచ రాములు, ఇట్టబోయిన లక్ష్మణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.